AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాదిని వణికిస్తున్న ఇసుక తుఫాన్… అకాల వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్ 16) మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తోంది. […]

ఉత్తరాదిని వణికిస్తున్న ఇసుక తుఫాన్... అకాల వర్షాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 17, 2019 | 4:28 PM

Share

ఉత్తరాది రాష్ట్రాలను ఇసుక తుఫాన్ వణికిస్తోంది. దీనికి తోడు అకాల వర్షాలు, పిడుగుపాటు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే 30 మందికి పైగా మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

గుజరాత్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్ 16) మధ్యాహ్నం నుంచి అకాల వర్షాలు, పిడుగుల వాన కురుస్తోంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 16 మంది, గుజరాత్‌లో 9 మంది మరణించారు. భారీ వర్షాలు, ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్‌లో ఆరుగురు మృతి చెందారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్, చిత్తోర్‌గఢ్‌, శ్రీగంగానగర్‌, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక గుజరాత్‌‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, పఠాన్, సబర్‌కాంత తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ సంభవించింది. మధ్యప్రదేశ్‌లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలపై ప్రధాని మోదీ స్పందించారు. అకాల వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

Follow Us
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..
పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి
పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి