AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ కార్యకర్తలను పరుగులు పెట్టించిన ఎద్దులు..!

పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. సింబాలిక్ గా ఉంటుందని ఎద్దుల బండి, రిక్షాలతో నిరసన తెలపాలనుకున్నారు నేతలు. కార్యకర్తల నినాదాలతో బెదిరిన ఎద్దులు పరుగులు పెట్టాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కాంగ్రెస్ కార్యకర్తలను పరుగులు పెట్టించిన ఎద్దులు..!
Balaraju Goud
|

Updated on: Jun 29, 2020 | 6:00 PM

Share

పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. సింబాలిక్ గా ఉంటుందని ఎద్దుల బండి, రిక్షాలతో నిరసన తెలపాలనుకున్నారు నేతలు. కార్యకర్తల నినాదాలతో బెదిరిన ఎద్దులు పరుగులు పెట్టాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ధర్నాలో కాడెద్దులు పరుగులు పెట్టించాయి. పెట్రో ధరలపై కాంగ్రెస్ పార్టీ నేతలు వరంగల్ లో నిరసన తెలపాలని ఫ్లాన్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఎద్దుల బండితో పాటు రిక్షాలతో ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కార్యకర్తల నినాదాలతో ఎద్దులు బెదిరపోయాయి. దీంతో ఒక్కసారి అలజడి మొదలైంది. కార్యకర్తలను అదిరించుకుని ఎద్దులు పరుగు అందుకున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లాయి. చివరికి ఎద్దుల బండి యాజమాని చాకచక్యంతో అదుపుచేయడంతో ఎద్దులు శాంతించాయి. ఈ ఘటనలో ఎద్దుల బండి యాజమానితో సహా నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఎద్దులను తీసేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దులు లేకుండానే బండిని లాగి నిరసన తెలిపారు.