AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమలం గూటికి గంటా..? నిజమెంత..?

ఏపీ టీడీపీలో ఏర్పడిన ముసలంతో ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి. అందులో గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్న గంటా.. వారందరితో త్వరలోనే కాషాయ కండువాను కప్పుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ వార్తలపై స్పందించారు గంటా. అయితే తనపై జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన […]

కమలం గూటికి గంటా..? నిజమెంత..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 4:14 PM

Share

ఏపీ టీడీపీలో ఏర్పడిన ముసలంతో ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి. అందులో గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్న గంటా.. వారందరితో త్వరలోనే కాషాయ కండువాను కప్పుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ వార్తలపై స్పందించారు గంటా. అయితే తనపై జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన వెల్లడించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ప్రస్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్నారు. అయినా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్న ఆయన.. శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు.