AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారిటోరియం రుణాల వడ్డీ వసూలుపై సుప్రీంకోర్టులో వాదం

మారిటోరియం సమయంలో రుణాల వడ్డీ వసూలు అంశంపై ఇవాళ(సోమవారం) సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బిఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక వారం సమయం మంజూరు చేసింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని కేంద్రం, ఆర్బీఐని ఈ సందర్భంలో సుప్రీంకోర్టు కోరింది. గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ లో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని తెలిపిన […]

మారిటోరియం రుణాల వడ్డీ వసూలుపై సుప్రీంకోర్టులో వాదం
Venkata Narayana
|

Updated on: Oct 05, 2020 | 12:39 PM

Share

మారిటోరియం సమయంలో రుణాల వడ్డీ వసూలు అంశంపై ఇవాళ(సోమవారం) సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బిఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక వారం సమయం మంజూరు చేసింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని కేంద్రం, ఆర్బీఐని ఈ సందర్భంలో సుప్రీంకోర్టు కోరింది. గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ లో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని తెలిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది.

ఇలా ఉంటే, కరోనా కష్టకాలంలో వ్యక్తిగత, ఎంఎస్‌ఎంఇ రుణగ్రహీతలకు లాక్ డౌన్ మారిటోరియం సమయంలో విధించిన ఆరు నెలల వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గతవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి విన్నవించిన సంగతి తెలిసిందే. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన సదరు అఫిడవిట్‌లో తెలిపింది. తాము తీసుకున్న నిర్ణయం వల్ల రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఇ, వ్యక్తిగత రుణాలతో పాటు విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందని కూడా ఆవేళ స్పష్టం చేసింది.