హైదరాబాద్ చేరుకున్న తులసీ రాం మృతదేహం..

శ్రీలంక ఉగ్రదాడిలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరాం మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. కొలంబోలోని హోటల్‌లో పేలుడు జరగడంతో తులసీరాం చనిపోగా, ఆయన స్నేహితుడు శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. తులసీరాం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తులసీరాం ఆస్ట్రేలియాలో పైలెట్‌గా శిక్షణ పొందారు. ఆయన కుటుంబం అమీర్‌పేటలో నివాసం ఉంటోంది. గత శనివారం స్నేహితులతో కలిసి కొలంబోకు వెళ్లారు తులసీరాం. శనివారం రాత్రి కూడా తనతో తులసీ రాం మాట్లాడారని ఆయన తల్లి నళిని చెప్పారు. కాగా.. తన […]

హైదరాబాద్ చేరుకున్న తులసీ రాం మృతదేహం..
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 25, 2019 | 7:30 PM

శ్రీలంక ఉగ్రదాడిలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరాం మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. కొలంబోలోని హోటల్‌లో పేలుడు జరగడంతో తులసీరాం చనిపోగా, ఆయన స్నేహితుడు శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. తులసీరాం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

తులసీరాం ఆస్ట్రేలియాలో పైలెట్‌గా శిక్షణ పొందారు. ఆయన కుటుంబం అమీర్‌పేటలో నివాసం ఉంటోంది. గత శనివారం స్నేహితులతో కలిసి కొలంబోకు వెళ్లారు తులసీరాం. శనివారం రాత్రి కూడా తనతో తులసీ రాం మాట్లాడారని ఆయన తల్లి నళిని చెప్పారు.

కాగా.. తన ఫ్రెండ్ తులసీ రాం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ నటుడు శివాజీ రాజా. శుభకార్యం ఉండటంతో తాను వెళ్లలేదని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆందోళన చెందారు. ఐదుగురు కలిసి ఈ టూర్ ప్రోగ్రామ్ చేసుకున్నామని.. కానీ పని ఉండటంతో నేను వెళ్లలేకపోయానన్నారు శివాజీరాజా.