AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి సేవలో మహేష్ అండ్ టీం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రిన్స్‌ మహేష్‌బాబు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్‌ హిట్‌ అవడంతో.. నిన్న రాత్రే తిరుమలకు చేరుకుంది మూవీ యూనిట్‌. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మహేష్‌బాబు ఫ్యామిలీ, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌ తదితరులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం వెలుపలకు వచ్చిన మహేష్‌బాబును చూసేందుకు అభిమానులు […]

శ్రీవారి సేవలో మహేష్ అండ్ టీం
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 17, 2020 | 7:10 PM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రిన్స్‌ మహేష్‌బాబు. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్‌ హిట్‌ అవడంతో.. నిన్న రాత్రే తిరుమలకు చేరుకుంది మూవీ యూనిట్‌. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మహేష్‌బాబు ఫ్యామిలీ, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేష్‌ తదితరులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనానంతరం వెలుపలకు వచ్చిన మహేష్‌బాబును చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే వీరితో పాటు హీరోయిన్ రష్మికా మందన్న కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. కర్నాటకలోని తన ఇంట్లో గురువారం ఐటీ దాడుల సందర్భంగా ఆమె వెళ్లలేదని సమాచారం.

కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదలై బంపర్ హిట్‌ని అందుకుంది. ఈ సినిమా హిట్ అయిన సందర్భంగా ఈ టీం మొత్తం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.