AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో ముమ్మరంగా రిపబ్లిక్ డే ఏర్పాట్లు..!

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 71వ గణతంత్ర దినోత్సవం విశాఖలో జరగనుంది. ఆర్కే బీచ్ వద్ద ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయ మూర్తులు సహా మంత్రులు, అధికార ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే గవర్నర్ స్పీచ్ కూడా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. దీంతో.. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులకు పలు సూచనలు జారీ చేస్తున్నారు. […]

విశాఖలో ముమ్మరంగా రిపబ్లిక్ డే ఏర్పాట్లు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 18, 2020 | 2:41 PM

Share

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 71వ గణతంత్ర దినోత్సవం విశాఖలో జరగనుంది. ఆర్కే బీచ్ వద్ద ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయ మూర్తులు సహా మంత్రులు, అధికార ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే గవర్నర్ స్పీచ్ కూడా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

దీంతో.. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులకు పలు సూచనలు జారీ చేస్తున్నారు. జేసీ వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ రంగా రెడ్డితో కలిసి వైజాగ్ బీచ్ రోడ్డును పరిశీలించారు. కాగా.. ముఖ్యమంత్రి, పబ్లిక్ సీటింగ్ ఎరేంజ్‌మెంట్స్‌‌, ముఖ్యంగా పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కమిటీలను నియమించారు. రిపబ్లిక్ డే కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 1500 మంది పోలీసులు రక్షణ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా.. అన్ని శాఖలకు సంబంధించిన శకటాలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. సుమారు 10 నుంచి 15 దళాలు మార్చ్ పాస్ట్‌ చేయనున్నాయి.