AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు!

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవాదుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు సమాచారం. దీంతో హోంమంత్రిత్వ శాఖ అఫ్గన్‌ ఉగ్రవాదుల సమాచారం ఇవ్వాలని […]

పాక్ సేవలో అఫ్గాన్‌ ఉగ్రవాదులు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 17, 2019 | 8:20 PM

Share

కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్‌ దళాలు అఫ్గన్‌ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవాదుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించనట్లు సమాచారం. దీంతో హోంమంత్రిత్వ శాఖ అఫ్గన్‌ ఉగ్రవాదుల సమాచారం ఇవ్వాలని భద్రతా దళాలను కోరింది. ఫోన్‌ సదుపాయాలను పునరుద్దరణను ఐఎస్‌ఐ అవకాశంగా తీసుకునే ప్రమాదాలు ఉన్నట్లు భద్రతా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మాత్రం కశ్మీరీ స్థానికులపై దారుణాలు ఆపడం లేదు. షోపియాన్‌ జిల్లాలో ఇద్దరు పండ్ల వ్యాపారులను బలితీసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి భారత్‌, పాక్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో పాక్‌ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత దళాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి.

పాక్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్‌ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరు దీపావళి రోజున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని గురువారం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల మధ్య టెలిఫోన్‌ సంభాషణను గుర్తించిన నిఘా అధికారులు, ఉగ్ర కుట్ర చాలా పెద్దదని తేల్చారు. భారత్‌లోకి చొరబడ్డాక తమ మనుషులను ఢిల్లీలో కలుసుకొనేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సైనికాధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

Follow Us
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
వినాయకుడికి ఇష్టమైన పండుతో అమృతంలాంటి రోటి పచ్చడి
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
కాళ్ళ వాపులతో ఇబ్బందా? ఇవి తింటే వృద్యాప్యంలో కూడా గుర్రంలా
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ