AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను అధిగమిస్తే భారత్‌కు ఉజ్వల భవిత.. బీజేపీ వైట్ పేపర్

కరోనాను నియంత్రించే దిశగా తీసుకుంటున్న చర్యలలో యావత్ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలందుకుంటున్న భారత్‌కు.. కరోనాను సక్సెస్‌ఫుల్ అధిగమించగలిగితే ఉజ్వల భవిత వుందని అంఛనా వేస్తోంది దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవంప చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది అధికార బీజేపీ.

కరోనాను అధిగమిస్తే భారత్‌కు ఉజ్వల భవిత.. బీజేపీ వైట్ పేపర్
Rajesh Sharma
|

Updated on: Apr 24, 2020 | 6:52 PM

Share

కరోనాను నియంత్రించే దిశగా తీసుకుంటున్న చర్యలలో యావత్ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలందుకుంటున్న భారత్‌కు.. కరోనాను సక్సెస్‌ఫుల్ అధిగమించగలిగితే ఉజ్వల భవిత వుందని అంఛనా వేస్తోంది దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవంప చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది అధికార బీజేపీ. పలువురు ఆర్థిక రంగ నిఫుణులు, పారిశ్రామిక వేత్తలు, డిజిటల్ రంగ ప్రతినిధులు, సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో విస్తృత సంప్రదింపుల అనంతరం నివేదిక రూపొందించిన బీజేపీ.. దానిని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌లకు అందించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి బీజేపీ కీలక సూచనలను పార్టీ నివేదికలో పేర్కొంది. దీర్ఘకాలిక ప్రణాళికతో తయారీ రంగ నూతన విధానాన్ని రూపొందించాలని నివేదికలో సూచించింది బీజేపీ. కొత్త విధానంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా విధానాలను రూపొందించాలని, కార్మిక చట్టాలను సవరిస్తూ సులభతరమైన విధానాలను అమల్లోకి తేవాలని వివరించింది. కోవిడ్-19 అనంతర పరిస్థితుల్లో భారతదేశానికి విస్తృత అవకాశాలుంటాయని బీజేపీ అంఛనా వేసింది.

దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చుకోడానికి ఇదే సరైన సమయమని, అనుమతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండొద్దని, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని బీజేపీ తన నివేదికలో సూచించింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రత్యేకంగా ఓ నివేదికను మోదీ ప్రభుత్వానికి అంద జేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు అడ్డంకి కాకూడదని, సరిహద్దులు దాటి అమ్ముకునే స్వేచ్ఛ రైతాంగానికి కల్పించాలని సూచించింది.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?