AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం.. నిందితుల డెబిట్ కార్డు నుంచి లక్షలు దోచేసి.. ఆఖరుకు

ఏ దొంగతనం జరిగినా, ఏ దోపిడీ జరిగినా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నిందితులను పట్టుకుని వారి నుంచి మన వస్తువులను ఇచ్చే విధిని వారు నిర్వర్తిస్తుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ అండగా ఉంటారు. అయితే ఓ...

Hyderabad: ఇన్‌స్పెక్టర్‌ నిర్వాకం.. నిందితుల డెబిట్ కార్డు నుంచి లక్షలు దోచేసి.. ఆఖరుకు
Pahadi Sharif
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 7:46 AM

Share

ఏ దొంగతనం జరిగినా, ఏ దోపిడీ జరిగినా ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నిందితులను పట్టుకుని వారి నుంచి మన వస్తువులను ఇచ్చే విధిని వారు నిర్వర్తిస్తుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ అండగా ఉంటారు. అయితే ఓ పోలీస్ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓ కేసులో అరెస్టైన వారి నుంచి డెబిట్ కార్డు సేకరించి రూ.లక్షలు కొల్లగొట్టాడు. నిందితుడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక అసలు విషయం తెలుసుకుని కంగు తిన్నాడు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాచకొండ(Rachakonda) పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మేవాత్‌ ముఠాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్లు రవాణా చేస్తున్న కంటైనర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో బాధితులు పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే నెల22న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొన్న సమయంలో వారి వద్ద ఉన్న వస్తువులను పోలీసులు తీసుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఇన్‌స్పెక్టర్‌ దొంగిలించిన టైర్లను కొనుగోలు చేసిన సెల్‌ఫోన్లు, బ్యాంకు డెబిట్‌ కార్డులు, పిన్‌ నంబర్లు సేకరించాడు.

రిసీవర్‌ నుంచి తీసుకున్న డెబిట్‌ కార్డు, పిన్‌ నంబర్‌ వివరాలను కొరియర్‌ ద్వారా తిరుపతిలోని స్నేహితురాలికి పంపాడు. అక్కడి ఏటీఏం కేంద్రాల్లో విడతల వారీగా ఆమె రూ.5లక్షలకు పైగా నగదు తీసుకుంది. నిందితుడు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగించుకుని బయటకు వచ్చాక విషయం తెలుసుకుని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులే తన డబ్బును తీసుకున్నారనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో రాచకొండ సీపీ స్పందించి.. అంతర్గత విచారణకు ఆదేశించారు.

ఈ దర్యాప్తులో ఆ డెబిట్ కార్డుతో తిరుపతిలో లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌, బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఇన్ స్పెక్టర్ స్నేహితురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో ఆమె నగదు తీసుకున్నట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించి.. పోలీసు అధికారిపై విచారణ జరిపుతామని వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!

IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌ నెంబర్‌వన్‌.. ప్లే ఆఫ్‌లో చేరిన మొదటి జట్టు..

Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత