“వందేభారత్‌” ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ- వారణాసిల మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత హైస్పీడ్ ట్రైన్ ను శుక్రవారం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ కు వందేభారత్ గా నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ రైలులో మొత్తం 16ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ […]

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:20 PM

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ- వారణాసిల మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత హైస్పీడ్ ట్రైన్ ను శుక్రవారం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ కు వందేభారత్ గా నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో మాట్లాడారు. ఈ రైలులో మొత్తం 16ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా రాకపోకలు సాగించే ఈ రైలులో 1128మంది కూర్చొనేలా సీట్లున్నాయి. ఢిల్లీ – వారణాసి మధ్య మొత్తం 753 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9గంటల 40నిమిషాల్లో పూర్తిచేయనుంది. మధ్యలో రెండు స్టేషన్లలో 40నిమిషాలపాటు ఆగనుంది. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ తో అనుసంధానించిన ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్,వైఫై ఎంటర్ టైన్మెంట్ సౌకర్యాలున్నాయి. కాగా వందేభారత్ ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తోపాటు మరికొందరు మంత్రులు రైలులో కొద్దిదూరం ప్రయాణించారు. ఈ నెల 17వ తేదీ నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.