అంతరిక్షంలోకి ప్రధాని మోదీ సందేశం.. నేడు విక్రమ్-1 చారిత్రక ప్రయోగం
భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రక ఘట్టంగా స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 నేడు తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన "వందే మాతరం" సందేశం కూడా అంతరిక్షంలోకి వెళ్లనుండగా, భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.

భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ నేడు ఉదయం 11:30 గంటలకు తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం కూడా అంతరిక్షంలోకి వెళ్లనుంది. “వందే మాతరం” అని మోదీ స్వహస్తాలతో రాసిన స్మారక కార్డు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పంపిన వందలాది శుభాకాంక్షల కార్డులతో కలిసి భూమి వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.
ప్రయోగానికి ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “నేడు ఉదయం 11:30 గంటలకు స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలో ప్రైవేట్గా అభివృద్ధి చేసిన తొలి ప్రయోగ వాహనం విక్రమ్-1ను కక్ష్యలోకి పంపనుంది. వేగవంతమైన, అవసరానికి అనుగుణంగా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రూపొందించిన ఈ నాలుగు దశల రాకెట్ మన యువత ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనం. అంతరిక్ష రంగంలో చేపట్టిన సంస్కరణలు ఆవిష్కరణలకు, కొత్త అవకాశాలకు ఎలా దారితీశాయో ఈ ప్రయోగం చూపిస్తోంది” అని పేర్కొన్నారు.
A historic new frontier for India’s space journey!
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
— Narendra Modi (@narendramodi) July 18, 2026
ప్రధాని సందేశానికి ప్రతిస్పందనగా స్కైరూట్ “వంద కోట్ల కలలు… అంతకుమించిన అవకాశాలు ” పేరుతో ప్రత్యేక నోట్ విడుదల చేసింది. ప్రతి కొత్త ఉపగ్రహం భూమిపై కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుందని, ఇంటర్నెట్ సేవలు, ఖచ్చితమైన నావిగేషన్, వ్యవసాయం, వాతావరణ అంచనాలు, విపత్తుల హెచ్చరికలు, జాతీయ భద్రత, మత్స్యకారులకు మార్గదర్శకం, వాతావరణ మార్పులపై పరిశోధనలు, భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) ఆధారిత ప్రపంచ నిర్మాణంలో ఉపగ్రహాల పాత్ర అత్యంత కీలకమని అందులో పేర్కొంది.
Among the payloads on Vikram-1 Test Flight-1 is something truly special—a handwritten postcard from Hon’ble Prime Minister Shri @narendramodi with the words, “Vande Mataram.” 🇮🇳🚀
It travels to space alongside handwritten messages from our team, investors, policymakers, and… pic.twitter.com/sJajN6NiVJ
— Skyroot Aerospace (@SkyrootA) July 17, 2026
స్కైరూట్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా కూడా ప్రత్యేక సందేశాలు పంపారు.
భారత్ ప్రైవేట్ స్పేస్ రంగానికి స్కైరూట్ ప్రతీక
భారత్ అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత వేగంగా ఎదిగిన సంస్థల్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఒకటి. గతంలో ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన ఈ రంగంలో ఇప్పుడు స్టార్టప్లు రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష సేవలను అభివృద్ధి చేస్తూ ప్రపంచ మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలైన సంస్కరణలతో IN-SPACe ఏర్పాటై, ప్రైవేట్ సంస్థలకు ఇస్రో సదుపాయాలు, సాంకేతిక సహకారం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పులు పెట్టుబడిదారులు, ఇంజినీర్లు, యువ పారిశ్రామికవేత్తలను అంతరిక్ష రంగం వైపు ఆకర్షించాయి.
విక్రమ్-1తో మరో చరిత్ర సృష్టించే లక్ష్యం
భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరుతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్, భారత్తో పాటు విదేశీ ఖాతాదారుల ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో రూపొందించబడింది. 2022లో స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్-ఎస్ భారతదేశంలో ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి రాకెట్గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు విక్రమ్-1 విజయవంతమైతే, ప్రపంచ ప్రైవేట్ ప్రయోగ వాహన సంస్థల సరసన స్కైరూట్కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
2018లో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ చంద్రన, నాగ భరత్ డాకా స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్, నేడు భారత అంతరిక్ష రంగంలో అతిపెద్ద ప్రైవేట్ విజయగాథల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష రంగానికి మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
