AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం క్లాస్

విజయవాడ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనందకుమార్, ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఒప్పందాల్లో […]

ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం క్లాస్
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2019 | 10:22 PM

Share
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనందకుమార్, ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఒప్పందాల్లో ఏదైనా కుట్ర జరగడం లేదా మితిమీరిన లబ్ధి చేకూరిందని రుజువైతే తప్ప ఒప్పందాలను పున:పరిశీలన చేయరాదని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.
అలా కానీ పక్షంలో గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని గుర్తుచేసింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇందన శాఖ గుర్తు చేసింది. ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించింది.