AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..

ప్లేస్‌.. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్‌ గేట్‌..! పోలీస్‌ ఎస్కార్ట్‌ తో ఒక వాహనం అక్కడకు చేరుకుంటుంది. ఈలోగా చుట్టుపక్కల నుంచి కొంతమంది దుండగులు పరిగెత్తుకుంటూ వచ్చారు.

Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..
Pigs Vehicle
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2021 | 6:08 PM

Share

ప్లేస్‌.. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్‌ గేట్‌..! పోలీస్‌ ఎస్కార్ట్‌ తో ఒక వాహనం అక్కడకు చేరుకుంటుంది. ఈలోగా చుట్టుపక్కల నుంచి కొంతమంది దుండగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందున్న ఎస్కార్ట్‌ వాహనాన్ని వదిలి వెనుకున్న వాహనంపైకి దూసుకువెళ్ళారు. డ్రైవర్‌పై దాడి చేయడంతో పరుగులు తీశాడు. ఈలోగా దుండగులంతా ఆ వాహనాన్ని ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనతో కంగుతిన్న ఎస్కార్ట్‌ సిబ్బంది… ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ ఆ వాహనంలో ఉన్నదేంటంటే.. ఊర పందులు..! విజయనగరం నుంచి తరలిస్తున్నారు.

విజయనగరం మున్సిపాలిటీలో సంచరించే పందులను పట్టుకుని.. వాటిని చెన్నైకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఎస్కార్ట్‌ కూడా జతచేశారు. అయితే.. గత రాత్రి ఈ వాహనాలు హైవే మీదుగా విజయనగరం నుంచి విశాఖ జిల్లా నక్కపల్లి వరకు చేరుకున్నాయి. ముందు ఎస్కార్ట్‌ వాహనం.. వెనుక పందులతో కూడిన మరో బొలేరో. ఈ వాహనాలు రెండూ నక్కపల్లి టోల్‌ గేట్‌ వద్ద వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అప్పటికే అక్కడ కాపు కాసిన దుండగులు.. పరుగెత్తికుని వచ్చి వాహనాలను చుట్టుముట్టారు. ఎస్కార్ట్‌ వెనుకున్న పందుల వాహనం నడుపుతున్న డ్రైవర్‌పై దాడి చేశారు. భయంతో డ్రైవర్‌ కిందకు దిగి ఎస్కార్ట్‌ వైపు పరిగెత్తాడు. ఈ లోగా పందుల వాహనాన్ని బ్యాక్‌ చేసుకుని ఎత్తుకెళ్ళారు దుండగులు. అయితే.. అక్కడే ఉన్న ఎస్కార్ట్‌ సిబ్బంది చూస్తూ ఊరుకుండిపోయారే తప్పా ఏమీ చేయలేకపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.

విషయాన్ని స్థానిక నక్కపల్లి పోలీసులకు ఎస్కార్ట్‌ సిబ్బంది సమాచారాన్ని అందించారు. పోలీసులు అలర్టయ్యే సరికి కొద్ది దూరం వెళ్లాక పందుల వాహనాన్ని ఆపి దుండగులు పారిపోయారు. ఎస్కార్ట్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వాహనాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు నక్కపల్లి సీఐ నారాయణరావు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది పందుల యజమానులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. విజయనగరం అధికారులతో పోలీసులు మాట్లాడుతున్నారు. ఎస్కార్ట్‌ సిబ్బంది వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు. మొత్తంమ్మీద ఎస్కార్ట్‌ ఉన్న వాహనాన్నే దుండగులు హైజాక్‌ చేశారంటే.. పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.

Also Read:కత్తి మహేష్‌కు చికిత్స నిమిత్తం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం.. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

 ‘అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి’.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్