రైతు కోటయ్య మృతిపై మేము సమీక్షిస్తాం: పవన్ కళ్యాణ్
విజయవాడ: గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తుండటంతో అసలు విషయం తెలుసుకునేందుకు తమ పార్టీ తరుపున సమీక్ష జరుపుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కొండవీడులో నిన్న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రైతు పిట్టల కోటేశ్వరరావు (కోటయ్య) చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు […]
విజయవాడ: గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కోటయ్య మృతిపై భిన్న కథనాలు వినిపిస్తుండటంతో అసలు విషయం తెలుసుకునేందుకు తమ పార్టీ తరుపున సమీక్ష జరుపుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కొండవీడులో నిన్న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రైతు పిట్టల కోటేశ్వరరావు (కోటయ్య) చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో ప్రభుత్వం ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవద్దని, సానుభూతితో వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాత స్వేదంతోనే బతుకుతున్న సమాజానికి రైతుల ఆర్తనాదాలు మంచివి కావని పవన్ తన సోషల్ మీడియాలో తెలిపారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో ఆ గ్రామానికి చెందిన కోటయ్యకు చెందిన తోటలను నాశనం చేశారని, పోలీసులు కొట్టడం వల్లే ఆయన చనిపోయారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
JanaSena Chief @PawanKalyan on Facebook. pic.twitter.com/Aqvd5OuWse
— JanaSena Party (@JanaSenaParty) February 19, 2019