పూరీ ఆలయానికి కరోనా దెబ్బ.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

కరోనా మహమ్మారి ఇందు లేదు అందు కలదు అన్నట్లు అన్ని చోట్లకు పాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాసి ఆలయాలను సైతం వదలడంలేదు.

పూరీ ఆలయానికి కరోనా దెబ్బ.. 400 మంది సిబ్బందికి పాజిటివ్
Follow us

|

Updated on: Sep 29, 2020 | 1:51 PM

కరోనా మహమ్మారి ఇందు లేదు అందు కలదు అన్నట్లు అన్ని చోట్లకు పాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాసి ఆలయాలను సైతం వదలడంలేదు. సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు పూరీ శిరిమందిరాన్ని తిరిగి తెరవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు. కాగా, కరోనా బారినపడ్డ 400 మందిలో 9 మంది వైరస్ ధాటికి ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు భువనేశ్వర్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో చికి్త్సపొందుతున్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, పాలన అధికారి అజయ్ కుమార్ జెనా వెల్లడించారు. ఇక, కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది హోం ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దీంతో ఆలయాన్ని తెరిచేందుకు సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల దర్శనాలను నిలిపివేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ పూజారులు మాత్రం… నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఒడిశా హైకోర్టుకు సమర్పించింది రాష్ట్ర సర్కార్. మొత్తం 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు జరిపినట్లు తెలిపింది. ఆలయాన్ని భక్తుల కోసం తెరిస్తే…. పూజారులు, సిబ్బంది, వారి కుటుంబాలు సహా… మొత్తం 2,200 మందిపై కరోనా ప్రభావం పడుతుందని అజయ్ కుమార్ వివరించారు. మరోవైపు, ప్రస్తుతం ఒడిశాలో 35,006 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ కరోనాతో 797 మంది చనిపోయారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..