AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో ప్రధాన ఆస్పత్రుల్లో అన్ని రకాల సేవలు

కరోనా మహమ్మారి ధాటికి ఆస్పత్రులు సైతం మూతపడ్డాయి. ప్రత్యేకించి కొవిడ్ రోగులకు తప్ప ఇతరులను ఎవ్వరిని ఆస్పత్రుల్లో చేరుకునేందుకు ముందు రాలేదు. ఆయా ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా నెమ్మదిగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

త్వరలో ప్రధాన ఆస్పత్రుల్లో అన్ని రకాల సేవలు
Balaraju Goud
|

Updated on: Oct 07, 2020 | 6:00 PM

Share

కరోనా మహమ్మారి ధాటికి ఆస్పత్రులు సైతం మూతపడ్డాయి. ప్రత్యేకించి కొవిడ్ రోగులకు తప్ప ఇతరులను ఎవ్వరిని ఆస్పత్రుల్లో చేరుకునేందుకు ముందు రాలేదు. దీంతో ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు నానాయాతన అనుభవించారు. అటు గ్రేటర్‌ వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా 500 మందిపైనే ఐసీయూలో ఉన్నవారు మాత్రమే ఉంటున్నారు. వందమంది ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది.

అయితే, మిగతా ఆసుపత్రుల్లో సగానికిపైగా పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో ఇతర సేవలను కూడా నెమ్మదిగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలకే పరిమితం చేశారు. ఉస్మానియాలో మాత్రం 50పైగా ఐసోలేషన్‌ పడకలతోపాటు ఇతర సాధారణ సేవలు కొనసాగించారు. గాంధీ ఆసుపత్రిలో ఇతర వైద్య సేవలను పూర్తిగా నిలిపేసి కొవిడ్‌కే పరిమితం చేశారు.

గత కొన్నిరోజులుగా గ్రేటర్‌లో కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో ఇతర వైద్య సేవలను కూడా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. వారంరోజులుగా 250-300 మధ్యనే కేసుల సంఖ్య ఉంటోంది. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో నిత్యం 150-200 పరీక్షలు చేస్తున్నారు. అక్కడ కూడా తక్కువగానే కేసులు నిర్ధారణ అవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. తాజాగా మంగళవారం మలక్‌పేట, జాంబాగ్‌ పార్క్‌, మాదన్నపేట, గడ్డిఅన్నారం, శాలివాహన నగర్‌ పరిధిలో 321 మందికి పరీక్షలు చేస్తే కేవలం 16 మందిలో కరోనా లక్షణాలు కనిపింయాయి.

ఇక, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో 56 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహిస్తే ముగ్గురికే మాత్రమే కరోనా నిర్థారణ అయ్యింది. చాలామందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిలోనూ 95 మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరం, ఆయాసం, ఆక్సిజన్‌ తగ్గడం, ఇతర సమస్యలు ఉన్నవారే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గడిచిన 24 గంటల్లో గ్రేటర్‌ పరిధిలో 292 మంది కరోనా బారిన పడ్డారు. మేడ్చల్‌ జిల్లాలో 145 మందికి, రంగారెడ్డి జిల్లాలో 187 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

దీంతో అధికారులు హైదరాబాద్ పరిధిలో ప్రధాన ఆస్పత్రులను తెరిపించి పూర్తిస్థాయి వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయించారు. ఇందు కోసం వైద్య సిబ్బంది అనుసరించాల్సిన నిబంధనలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో అన్ని రంగాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల