Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్వుగట్టులో మూడు రోజులపాటు దర్శనాలు బంద్

కరోనా ప్రభావం దేవాలయాలపై కొనసాగుతూనే ఉంది. కొవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా సామూహిక కార్యక్రమాల్లో జనం ఎక్కువ సంఖ్యలో పాల్గొనకుండా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఇందులో భాగంగా న‌ల్ల‌గొండ జిల్లా చెర్వుగట్టులోని శ్రీ పార్వ‌తి జ‌డ‌ల రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్న‌ట్లు ఆల‌య సిబ్బంది ప్ర‌క‌టించింది. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆల‌యంలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి అమావాస్య రోజు చెర్వుగ‌ట్టు […]

చెర్వుగట్టులో మూడు రోజులపాటు దర్శనాలు బంద్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2020 | 5:23 PM

కరోనా ప్రభావం దేవాలయాలపై కొనసాగుతూనే ఉంది. కొవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా సామూహిక కార్యక్రమాల్లో జనం ఎక్కువ సంఖ్యలో పాల్గొనకుండా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఇందులో భాగంగా న‌ల్ల‌గొండ జిల్లా చెర్వుగట్టులోని శ్రీ పార్వ‌తి జ‌డ‌ల రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్న‌ట్లు ఆల‌య సిబ్బంది ప్ర‌క‌టించింది. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆల‌యంలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి అమావాస్య రోజు చెర్వుగ‌ట్టు ఆల‌యానికి సుమారు ల‌క్ష‌ మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఆరోజు ఆలయం వద్ద నిద్ర చేస్తే ఆర్థిక‌, అనారోగ్య స‌మ‌స్య‌లు తొలగిపోతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం.

ఈ క్ర‌మంలో ఒకేసారి అంత‌మంది భ‌క్తులు గుమిగూడితే క‌రోనా వ్యాపించే అవకాశం ఉన్నందున ఆల‌యాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. శ్రావణమాసానికి తోడు అమావాస్య ఆగ‌స్టు 19న వ‌స్తుంది. దీంతో ఈ మూడు రోజులు భక్తులను అనుమతించబోమని పాలక మండలి తెలిపింది. నిత్య కైంకర్య సేవల కోసం కేవ‌లం పూజారులు మాత్ర‌మే ఆల‌యంలోకి అనుమతిస్తామన్నారు. తిరిగి ఆగ‌స్టు 21 నుంచి భ‌క్తుల‌కు యధావిధిగా దర్శనాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆల‌య సిబ్బంది సూచిస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..