జోరు పెంచిన నాగ్, ‘బ్రహ్మాస్త్ర’ కోసం ముంబయికు
కింగ్ నాగార్జున దూసుకుపోతున్నారు. లాక్డౌన్ అనంతం షూటింగ్ మొదలుపెట్టిన తెలుగు మొదటి అగ్ర హీరో ఆయనే. ఓవైపు బిగ్ బాస్ తెలుగు షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమాల చిత్రీకరణల్లో కూడా భాగమవుతున్నారు.
కింగ్ నాగార్జున దూసుకుపోతున్నారు. లాక్డౌన్ అనంతం షూటింగ్ మొదలుపెట్టిన తెలుగు మొదటి అగ్ర హీరో ఆయనే. ఓవైపు బిగ్ బాస్ తెలుగు షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమాల చిత్రీకరణల్లో కూడా భాగమవుతున్నారు. ఇటీవలే హిమాలయాల్లో ‘వైల్డ్డాగ్’ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీరాయ్తో కలిసి నాగ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను వీరి మీద తెరకెక్కిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్గా కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నాగార్జున చూపిస్తోన్న జోరు చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !
ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం