AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’

నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాను వింత వ్యాధి వణికించింది. వింత వ్యాధి కారణంగా ప్రజలు బెంబేలేత్తిపోయారు. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాను

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. 'పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ'
Ram Naramaneni
|

Updated on: Feb 21, 2021 | 8:38 AM

Share

నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాను వింత వ్యాధి వణికించింది. వింత వ్యాధి కారణంగా ప్రజలు బెంబేలేత్తిపోయారు. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాను మరో వింతవ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. స్థానిక మేకల కాపారికి చెందిన 20 మేకలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. మరో 15 జీవాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

చనిపోయిన మేకలు..పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ మరణించినట్లుగా మేకల కాపారులు చెబుతున్నారు. జీవాలకు సోకిన వ్యాధి ఏంటి అనేది అంతుచిక్కకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పశు వైద్యులు సైతం గ్రామాన్ని సందర్శించారు. అంతు చిక్కని వ్యాధిపై ఆరా తీస్తున్నారు.

Also Read:

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..

Snake Found in Bike: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు పెట్టింది.. పార్ట్స్ మొత్తం విడదీయాల్సి వచ్చింది.. చివరకు