AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరంలో మరింత నిఘా పెరగాలిః కేటీఆర్

భాగ్యనగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. సోమవారం డీజీపీ, నగర పోలీసు కమీషనర్లతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిశితంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 10 […]

భాగ్యనగరంలో మరింత నిఘా పెరగాలిః కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Oct 05, 2020 | 8:19 PM

Share

భాగ్యనగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. సోమవారం డీజీపీ, నగర పోలీసు కమీషనర్లతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిశితంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను సూచించారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరం హైదరాబాద్‌ అని, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరగా ఒక రిపోర్ట్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కంట్రోల్ లో ఉన్నాయన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోకి విదేశీ పెట్టబడులు పెద్ద ఎత్తున వస్తుండడంతో శాంతిభద్రతలతకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వీటితోపాటు పార్కులు, చెరువులు, బస్తి దావఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమిఃకూడే ప్రతి చోట నిఘా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

దీంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్ లను పోలీస్ శాఖ రూపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు.

Follow Us
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌