AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు. ఆ పచ్చడే ఓ ఊరు మొత్తాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ ఊరి ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ టైమ్‌‌‌‌లో ఊరంతటికీ సాయం చేద్దామనుకుని మామిడికాయ తొక్కు పెట్టించి ఊరంతా పంచాలనుకున్నాడు. అయితే పచ్చడి తయారి చేసిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మాకు కరోనా పరీక్షలు చేయండి బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి […]

ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 3:10 PM

Share

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు. ఆ పచ్చడే ఓ ఊరు మొత్తాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ ఊరి ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ టైమ్‌‌‌‌లో ఊరంతటికీ సాయం చేద్దామనుకుని మామిడికాయ తొక్కు పెట్టించి ఊరంతా పంచాలనుకున్నాడు. అయితే పచ్చడి తయారి చేసిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మాకు కరోనా పరీక్షలు చేయండి బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ సమయం‌‌లో ఊరంతటికీ ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. కొంత డబ్బు విరాళంగా రావడంతో మామిడి తొక్కు పెట్టి ఊరంతా పంచాలనుకున్నాడు. షాద్‌‌‌‌నగర్‌కి చెందిన తన బంధువైన వ్యాపారిని మే18న ఆశ్రయించాడు. ఊరందరికీ పచ్చడి సఫ్లై చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామసభ పెట్టి ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు ప్రజాప్రతినిధి భర్త. మే 20న షాద్‌‌‌‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు. అంతా దాన్ని రుచి చూశారు. వారితోనే ఉప్మా వండించుకొని తిన్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్​చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ అదే రోజు షాద్‌‌‌‌నగర్‌‌‌‌ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ మరుసటి రోజు పాజిటివ్ తేలింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరికీ భయం మొదలైంది. తొక్కు పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కును డంప్‌‌‌‌ యార్డులో పడేశారు. దీంతో ఊరు ఊరంతా వణికిపోతోంది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. భయపడి చస్తున్నం.. టెస్టులు చేయండంటూ మొత్తుకుంటోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇద్దరితో ఎక్కువగా కాంటాక్టయిన 12 మందికైనా పరీక్షలు చేయండంటూ ఊరోళ్లు మొర పెట్టుకుంటున్నారు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు 100 మందికి పైగా హోమ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌లో ఉన్నారు. ఎవరికి వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. టెస్ట్ చేయకుంటే ఊరంతా వల్లకాడుగా మారుతోందంటున్నారు.

Follow Us
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!