AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నవల ఆధారంగా క్రిష్ సినిమా.. ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్న చిత్రయూనిట్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా అడ్డు రావడం , పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాడు.

ప్రముఖ నవల ఆధారంగా క్రిష్ సినిమా.. ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్న చిత్రయూనిట్
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2020 | 4:04 PM

Share

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా అడ్డు రావడం , పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాను తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు క్రిష్. ఈ మూవీకి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది.

ఈ సినిమాను ‘కొండపొలం’ అనే నవల ఆదారంగా తెరకెక్కించారట. ఇక సినిమాకు కూడా ‘కొండపోలం’ అనే టైటిల్ నే పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. గొర్రెల మందను అడవిలోకి తీసుకుపోయిన ఓ బృందం అనుకోనుండా ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన వెంటనే క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు. అటు వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.