AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించామని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం […]

డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Rajesh Sharma
|

Updated on: Jan 17, 2020 | 2:18 PM

Share

నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించామని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను లోపాలు లేకుండా చేసేందుకు సవరణలు తీసుకొస్తామని అన్నారు. పోక్సో చట్టంలో మోదీ సర్కార్ మార్పులు చేసిందని, అందువల్లనే 18 ఏళ్ళలోపు యువతులపై నేరాలు జరిగితే దోషులకు రెండు నెలల్లోపే శిక్ష పడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. అందువల్లనే వరంగల్‌లో చిన్నారిని చిదిమేసిన రాక్షసునికి కేవలం 51 రోజుల్లోనే శిక్ష పడిందని అన్నారు.

నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే అన్నారని, దానికి అనుగుణంగా మరోసారి తనముందుకు వచ్చిన క్షమాభిక్ష అభ్యర్థనను ప్రెసిడెంట్ కోవింద్ కొట్టేశారని చెప్పారు. హోంశాఖకు వచ్చిన మెర్సీ పిటిషన్‌ను మేం ఏమాత్రం జాప్యం చేయకుండా డిస్పోజ్ చేశామని, అంతే వేగంగా రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకున్నారని అన్నారయన.