AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంతంగా భైంసా.. ఇంకా నిలచిన ఇంటర్నెట్ సేవలు..

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన బందోబస్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. పట్టణంలో ఇంకా 144 సెక్షన్‌ను ఇంకా సడలించలేదు. ఇతర ప్రాంతాల నుంచి భైంసా మీదుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాలోనే ఉంటున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నేటికి నాలుగు రోజులు అవుతుండటంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు గుంపు గుంపులుగా […]

ప్రశాంతంగా భైంసా.. ఇంకా నిలచిన ఇంటర్నెట్ సేవలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 17, 2020 | 2:00 PM

Share

నిర్మల్ జిల్లా భైంసాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన బందోబస్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. పట్టణంలో ఇంకా 144 సెక్షన్‌ను ఇంకా సడలించలేదు. ఇతర ప్రాంతాల నుంచి భైంసా మీదుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాలోనే ఉంటున్నారు.

కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నేటికి నాలుగు రోజులు అవుతుండటంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు గుంపు గుంపులుగా రోడ్లపై సంచరించరించొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టణంలో ప్రశాంత వాతావరణానికి.. పోలీసులకు సహకరించాలంటూ మైక్‌ల్లో ప్రచారం చేపడుతున్నారు.

ఇక ప్రస్తుతం భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌అలీ. పోలీసుల అప్రమత్తంగా ఉండటంతో.. హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. త్వరలోనే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని… సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారనే.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామన్నారు.