కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త

కట్టుకున్నవాడే కాలయముడైయ్యాడు. పెళ్లై ఓ బాబు పుట్టిన కట్నం డబ్బులపై మోజు తగ్గలేదు. అత్తారింటి నుంచి కాసులు రావని తెలిసి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా పాముకాటుతో చంపించాడు. ఒకే నెలలో రెండు సార్లు పాము కాటు వేయడంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. సూరజ్ […]

కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త
Follow us

|

Updated on: May 25, 2020 | 5:19 PM

కట్టుకున్నవాడే కాలయముడైయ్యాడు. పెళ్లై ఓ బాబు పుట్టిన కట్నం డబ్బులపై మోజు తగ్గలేదు. అత్తారింటి నుంచి కాసులు రావని తెలిసి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా పాముకాటుతో చంపించాడు. ఒకే నెలలో రెండు సార్లు పాము కాటు వేయడంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. సూరజ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నంతలో వీరి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి సూరజ్ కు మరింత కట్నంపై మోజు పడింది. దీంతో కట్నం కోసం ఉత్రాను కొన్ని నెలలుగా వేధించడం మొదలుపెట్టాడు. కానీ, ఆమె కుటుంబం నుంచి ఎటువంటి కట్నం వచ్చే అవకాశంలేదని గ్రహించిన సూరజ్.. ఉత్రాను అంతమొందించాలని డిసైడయ్యాడు. తన చేతులకు మట్టి అంటకుండా వదిలిచ్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం పక్కా ఫ్లాన్ రెడీ చేసుకున్నాడు. తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తికి రూ.పది వేలు చెల్లించి ఒక పామును కొన్నాడు. మార్చి నెలలో భార్య గదిలో నిద్రపోతుండగా.. పామును ఉత్రాపైకి వదిలాడు సూరజ్. పాము కాటు గమనించిన ఉత్రా వెంటనే తేరుకొని బంధువుల సాయంతో ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఉత్రా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత మే7న సూరజ్.. ఉత్రా దగ్గరకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత సూరజ్.. ఒక కోబ్రాను ఉత్రా మీదికి వదిలాడు. అది ఉత్రాను కాటేయడంతో ఆమె నిద్రలోనే చనిపోయింది. ఈ విషయం తెలియక ఉత్రా తల్లిదండ్రులు అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉత్రా పాముకాటుతో చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. అక్కడే ఉన్న సూరజ్ తనకేమీ తెలియదన్నట్లుగా గదిలో ఉన్న పామును కర్రతో కొట్టి చంపాడు. అయితే ఉత్రాకు రెండోసారి కూడా పాము కరవడంతో ఆమె తల్లిదండ్రులకు వారం తర్వాత అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సూరజ్ విచారించారు. దీంతో  అసలు విషయం బయటపడింది. సూరజ్ కట్నం కోసం ఈ హత్య చేశానని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఉత్రాను చంపడానికి ఐదు నెలలుగా స్కెచ్ వేసినట్లు వివరించాడు. సూరజ్ కు సహకరించిన సురేష్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..