AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇకపోతే హత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్రామ పెద్ద సంజీ రామ్‌తోపాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తేలిన పోలీస్ అధికారులు పర్వేష్ కుమార్, దీపక్ ఖజూరియాకు కోర్టు జీవితఖైదు విధించింది. ఇక మరో ముగ్గురు దోషులు తిలక్ రాజ్, సురేందర్ […]

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!
Ravi Kiran
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jun 10, 2019 | 6:56 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఇకపోతే హత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్రామ పెద్ద సంజీ రామ్‌తోపాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తేలిన పోలీస్ అధికారులు పర్వేష్ కుమార్, దీపక్ ఖజూరియాకు కోర్టు జీవితఖైదు విధించింది. ఇక మరో ముగ్గురు దోషులు తిలక్ రాజ్, సురేందర్ వర్మ, ఆనంద్ దత్తాకు ఐదు సంవత్సరాల చొప్పున శిక్షను పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు ఖరారు చేసింది.

కాగా అంతకముందు గ్రామ పెద్ద సంజీ రామ్, ఆనంద్ దత్తా, పర్వేష్ కుమార్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మలతో పాటు హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు కోర్టు దోషులుగా పేర్కొంది. మరోవైపు సంజీ రామ్ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా కోర్టు నిర్ధారించింది.

గత ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికను అపహరించి.. 4 రోజులపాటు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ అయింది. దాదాపు 17 నెలల పాటు ఈ కేసు విచారణ జరిగింది.