ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు ఊరట..!

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత అశోక్‌.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో పాటు ప్రతీరోజు పోలీసుల విచారణకు హాజరు […]

ఐటీ గ్రిడ్స్ కేసులో అశోక్‌కు ఊరట..!
Follow us

|

Updated on: Jun 10, 2019 | 5:28 PM

ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత అశోక్‌.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో పాటు ప్రతీరోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని అశోక్‌ను ఆదేశించింది హైకోర్టు.