AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై?.. కంగ‌నా వార్నింగ్

ముంబైలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కడిగిపడేసింది. శివ‌సేన నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తన మాటల తూటాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై గురి పెట్టింది. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై?.. కంగ‌నా వార్నింగ్
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2020 | 5:43 PM

Share

ముంబైలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కడిగిపడేసింది. శివ‌సేన నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తన మాటల తూటాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై గురి పెట్టింది. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ట్విట‌ర్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఏకంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే పై మాట‌ల దాడి చేసింది. త్వ‌ర‌లోనే తాను సీఎం ఉద్ద‌వ్ థాక్రేపై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని హెచ్చ‌రించింది. అయోధ్య‌, క‌శ్మీర్ నేప‌థ్యంలో సినిమాలు తీసి త్వ‌ర‌లోనే థాక్రేకు గుణ‌పాఠం చెప్తాన‌ని చుర‌క‌లంటించారు. ఉద్ధవ్ థాక్రే అంటూ ఏకవచనంతో మండిపడ్డారు.

‘‘నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. నీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను ట్విట్టర్ షేర్ చేసిన కంగనా బాబర్‌, అతని సైన్యం అంటూ కూల్చివేతకు వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

“ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై? ఫిల్మ్ మాఫియాతో పాటు నీవు కలిసిపోయావు, నా ఇంటిని కూల్చివేసి, నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? ఈ రోజు నా ఇల్లు కూల్చివేయబడింది, మీ అహంకారం రేపు విరిగిపోతుంది, ఇది సమయం యొక్క చక్రం, గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు,నీవు నాకు సహాయం చేసావు. కాశ్మీరీ పండితులు ఏమి చేశారో నాకు తెలుసు, కాని ఈ రోజు కూడా నేను భావించాను. అయోధ్యపై మాత్రమే కాకుండా కాశ్మీర్‌పై కూడా సినిమా చేస్తానని ఈ దేశానికి ప్రమాణం చేస్తున్నాను,”

ముంబైపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కంగ‌నా‌, శివ‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ కంగ‌నా చండీగ‌ఢ్ నుంచి ముంబైకు చేరుకోగానే శివ‌సేన కార్య‌క‌ర్త‌లు కంగ‌నా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ముంబై ఆందోళ‌న‌క‌ర వాతావ‌రణం నెల‌కొంది. రానున్న కాలంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Follow Us
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
వార్ ఐడియా అందిరింది.. పెళ్లి విషయంలో ఆ గ్రామం సరికొత్త రూల్స్..
వార్ ఐడియా అందిరింది.. పెళ్లి విషయంలో ఆ గ్రామం సరికొత్త రూల్స్..
కాకి ఎందుకు ఒక్క కన్నుతో చూస్తుంది..? శ్రీరాముడు బ్రహ్మాస్త్రం..
కాకి ఎందుకు ఒక్క కన్నుతో చూస్తుంది..? శ్రీరాముడు బ్రహ్మాస్త్రం..
స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయి పల్లవి..
స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయి పల్లవి..
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల