Mandi Shivaratri Fair : శివరాత్రి నుంచి ఏడు రోజులపాటు జరిగే జాతర… దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తుల హాజరు

ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక పండగ శివరాత్రి నేడు..దేశవ్యాప్తంగా శివాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. శివయ్యకు అభిషేకాలు చేస్తూ... శివనామస్మరణతో తరిస్తున్నారు.. అయితే ఈ శివరాత్రి రోజు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా అయితే కైలాసాన్ని తలపిస్తుంది. ఇక్కడ ఏడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు.. ఎన్నో విశేషాల సమాహారం మండి శివరాత్రి మహోత్సవం...

|

Updated on: Mar 11, 2021 | 2:54 PM

ఎక్కడైనా ఉత్సవం అంటే ఒక విగ్రహాన్ని తీసుకొస్తారు.. ఆ దేవీదేవతలకు పూజలు నిర్వహించి భక్తులు పండుగ జరుపుకుంటారు.. అయితే ఒకేసారి ఊరిలో ఉన్న దాదాపు రెండువందల ఉత్సవ మూర్తులు ఒకే చోట కొలువైతే.. ఆ దృశ్యం భక్తులకు కనుల పండుగే కదా.. ఆ ఉత్సవమే మండి ఉత్సవం .. ఇక్కడ శివరాత్రి సందర్భంగా జరిగే వేడుక కన్నులారా చూడాల్సిందే ..

ఎక్కడైనా ఉత్సవం అంటే ఒక విగ్రహాన్ని తీసుకొస్తారు.. ఆ దేవీదేవతలకు పూజలు నిర్వహించి భక్తులు పండుగ జరుపుకుంటారు.. అయితే ఒకేసారి ఊరిలో ఉన్న దాదాపు రెండువందల ఉత్సవ మూర్తులు ఒకే చోట కొలువైతే.. ఆ దృశ్యం భక్తులకు కనుల పండుగే కదా.. ఆ ఉత్సవమే మండి ఉత్సవం .. ఇక్కడ శివరాత్రి సందర్భంగా జరిగే వేడుక కన్నులారా చూడాల్సిందే ..

1 / 6
ప్రతి ఏడాది శివరాత్రి నుంచి ఏడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో జరిగే జాతరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ జాతరకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో ఏడురోజులు విష్ణు, శివులను ఆరాధిస్తూ.. వైష్ణవ, శైవ బేధాలు లేకుండా పూజలు నిర్వహిస్తారు.

ప్రతి ఏడాది శివరాత్రి నుంచి ఏడు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో జరిగే జాతరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ జాతరకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో ఏడురోజులు విష్ణు, శివులను ఆరాధిస్తూ.. వైష్ణవ, శైవ బేధాలు లేకుండా పూజలు నిర్వహిస్తారు.

2 / 6
 వారణాసి ఆఫ్ హిల్స్ గా పేరు పొందిన మండి జిల్లాలో సుమారు 181 దేవాలయాలఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఆలయాల్లోని ఉత్సవ మూర్తులను జాతర కు తీసుకొస్తారు. ఈ ఉత్సవాలు బీస్ నది ఒడ్డున నిర్వహిస్తారు. బీస్ నదిని దేవతలకు నిలయంగా స్థానికులు భావిస్తారు.

వారణాసి ఆఫ్ హిల్స్ గా పేరు పొందిన మండి జిల్లాలో సుమారు 181 దేవాలయాలఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఆలయాల్లోని ఉత్సవ మూర్తులను జాతర కు తీసుకొస్తారు. ఈ ఉత్సవాలు బీస్ నది ఒడ్డున నిర్వహిస్తారు. బీస్ నదిని దేవతలకు నిలయంగా స్థానికులు భావిస్తారు.

3 / 6
అయితే ఈ శివరాత్రి జాతర వెనుక అనేక ఇతిహాసాలున్నాయి. ఇక్కడ ప్రసిద్ధ ఆలయం శివుని యొక్క భూత్ నాథ్ ఆలయం ఈ క్షేత్ర పాలకుడు విష్ణు . పండగ జరిగే మండి పట్టణాన్ని 16వ శతాబ్దంలో రాజా అజ్బర్ సేన్ పరిపాలించాడు. ఆ సమయంలో మండి పట్టణం మధ్యలో శివునికి భూత్ నాథ్ ఆలయాన్ని నిర్మించారు.

అయితే ఈ శివరాత్రి జాతర వెనుక అనేక ఇతిహాసాలున్నాయి. ఇక్కడ ప్రసిద్ధ ఆలయం శివుని యొక్క భూత్ నాథ్ ఆలయం ఈ క్షేత్ర పాలకుడు విష్ణు . పండగ జరిగే మండి పట్టణాన్ని 16వ శతాబ్దంలో రాజా అజ్బర్ సేన్ పరిపాలించాడు. ఆ సమయంలో మండి పట్టణం మధ్యలో శివునికి భూత్ నాథ్ ఆలయాన్ని నిర్మించారు.

4 / 6
ఈ ఉత్సవం ప్రారంభం వెనుక ఓ కథ ఈశ్వరి సేన్ తో ముడిపడి ఉంది. 1792 లో పంజాబ్‌కు చెందిన సంసార్ చంద్ చేసిన యుద్ధంలో ఈశ్వరి సేన్ తన రాజ్యాన్ని కోల్పోయిన తరువాత 12 సంవత్సరాలు ఖైదీగా బంధిచబడ్డారు. గూర్ఖా వీరులు విడిపించారు. తనకు స్వేచ్ఛ లభించిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మండి లో ఉన్న దేవాలయాల ఉత్సవ మూర్తులను ఒక్క చోట చేర్చి జాతర జరిపారట. అప్పటి నుంచి శివరాత్రి పండుగ రోజు నుంచి ఏడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వచ్చిందట

ఈ ఉత్సవం ప్రారంభం వెనుక ఓ కథ ఈశ్వరి సేన్ తో ముడిపడి ఉంది. 1792 లో పంజాబ్‌కు చెందిన సంసార్ చంద్ చేసిన యుద్ధంలో ఈశ్వరి సేన్ తన రాజ్యాన్ని కోల్పోయిన తరువాత 12 సంవత్సరాలు ఖైదీగా బంధిచబడ్డారు. గూర్ఖా వీరులు విడిపించారు. తనకు స్వేచ్ఛ లభించిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మండి లో ఉన్న దేవాలయాల ఉత్సవ మూర్తులను ఒక్క చోట చేర్చి జాతర జరిపారట. అప్పటి నుంచి శివరాత్రి పండుగ రోజు నుంచి ఏడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వచ్చిందట

5 / 6
ఏడు రోజూ దేవతలను ఆరాధిస్తారు.. అంతేకాదు జానపద బృందాలు, నృత్యకారులు , రంగురంగుల దుస్తులను ధరించి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భారీ బహిరంగ మైదానంలో 200 మంది దేవతలకు స్థలం కేటాయించి ఉత్సవాలను నిర్వహిస్తారు. బియాస్ సుకేటి నదుల సంగమం ఈ జాతరకు వేదికగా మారుతుంది. ప్రతి రోజూ విభిన్న పోటీలను నిర్వహిస్తారు..

ఏడు రోజూ దేవతలను ఆరాధిస్తారు.. అంతేకాదు జానపద బృందాలు, నృత్యకారులు , రంగురంగుల దుస్తులను ధరించి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భారీ బహిరంగ మైదానంలో 200 మంది దేవతలకు స్థలం కేటాయించి ఉత్సవాలను నిర్వహిస్తారు. బియాస్ సుకేటి నదుల సంగమం ఈ జాతరకు వేదికగా మారుతుంది. ప్రతి రోజూ విభిన్న పోటీలను నిర్వహిస్తారు..

6 / 6
Follow us