AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR cabinet: మంత్రుల మధ్య బోర్డర్ పంచాయితీ.. సీఎంకు కొత్త తలనొప్పి

గులాబీ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యే ల మధ్య విబేధాలు పెరుగుతున్నాయా? జిల్లాలో మంత్రుల మధ్య గెట్టు పంచాయతీ మొదలైందా? పరిస్థితిని చూస్తుంటే నిజమేనంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. ఇందుకు పలు జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను ఎత్తిచూపుతున్నాయి.

KCR cabinet: మంత్రుల మధ్య బోర్డర్ పంచాయితీ.. సీఎంకు కొత్త తలనొప్పి
Rajesh Sharma
|

Updated on: Mar 05, 2020 | 11:00 AM

Share

Internal war between ministers worrying CM KCR: గులాబీ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యే ల మధ్య విబేధాలు పెరుగుతున్నాయా? జిల్లాలో మంత్రుల మధ్య గెట్టు పంచాయతీ మొదలైందా? సీనియర్ నేతలకు మంత్రులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందా? అసలు జిల్లాల్లో గులాబీ నేతల మధ్య విభేదాలకు కారణమేంటి?

టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకు నేతల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి చేరి కొందరు మంత్రి పదవులను దక్కించుకుంటే….. మరికొందరు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను దక్కించుకున్నారు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను జిల్లాల్లో మంత్రులకు..మంత్రులకు మధ్య విభేదాలే కాదు. మంత్రులకు, పార్టీ సీనియర్ నేతలకు ఆధిపత్య పోరు మొదలైందట.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేబినెట్‌లో ఎమ్మెల్యే దయాకర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని టాక్. జిల్లాలో అన్ని తానే అనుకుంటున్న దయాకర్ రావు ఉమ్మడి జిల్లా మొత్తం తిరుగుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు తన ప్రభావాన్ని చాటుకోవడం సత్యవతి రాథోడ్‌కు ఇబ్బందిగా మారిందట. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. దీంతో మహబూబాబాద్, ములుగు జిల్లాలను సత్యవతి రాథోడ్ చూసుకుంటారని…ఇద్దరి మంత్రుల మధ్య సరిహద్దులు గీశారట ముఖ్యమంత్రి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ దాదాపుగా ఇదే సమస్య మంత్రులకు ఎదురవుతోందట. ఈ జిల్లా నుంచి చి నలుగురు మంత్రులు క్యాబినెట్‌లో ఉన్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను పక్కనపెడితే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ల మధ్య కూడా వారి వారి నియోజక వర్గాల్లోనే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పుదామనుకున్నా ఆ పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో ఈ ఇద్దరు మంత్రులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగింది. ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు గ్రూప్‌ కట్టినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోను మంత్రి పువ్వాడ అజయ్‌కు మిగతా నేతలకు మధ్య ఉప్పు నిప్పు గానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పువ్వాడ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మధ్య కోల్డ్‌ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పట్టు కోసం ఇద్దరు ప్రయత్నాలు చేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారట. రంగారెడ్డి జిల్లాలోని దాదాపుగా ఇదే సమస్య. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కింది. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి జిల్లాలో ఇబ్బందికరంగా మారింది.

ఇదీ చదవండి: కరోనాపై చేతులెత్తేసిన గాంధీ డాక్టర్లు! Gandhi hospital doctors hands-up on Covid-19 tests

Follow Us
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర