AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా పంజా విసిరింది.

దేశంలో కరోనా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుర్‌గావ్‌లోని ఓ పేటిఎం ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇటీవలే ఇటలీకి వెళ్లొచ్చిన అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి దేశవ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వారిలో ఇటాలియన్లు 16 మంది, ఒక ఇండియన్‌ డ్రైవర్‌, ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో 6, తెలంగాణ ఒకరు, […]

Pardhasaradhi Peri
|

Updated on: Mar 05, 2020 | 10:30 AM

Share

దేశంలో కరోనా పంజా విసిరింది. పలు ప్రాంతాల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గుర్‌గావ్‌లోని ఓ పేటిఎం ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇటీవలే ఇటలీకి వెళ్లొచ్చిన అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి దేశవ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వారిలో ఇటాలియన్లు 16 మంది, ఒక ఇండియన్‌ డ్రైవర్‌, ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో 6, తెలంగాణ ఒకరు, కేరళలో 3, తాజాగా గుర్‌గావ్‌లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.

కరోనా వ్యాప్తితో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం..అన్ని మార్గాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుర్‌గావ్‌ ఉద్యోగికి కరోనా సోకడంతో..పేటీఎం సంస్థ తమ ఉద్యోగులకు కొద్ది రోజుల పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పించింది. ఇటు ఇండియన్‌ రైల్వే కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రతి డివిజనల్‌, సబ్‌ డివిజన్‌ ఆస్పత్రుల్లో స్పెషల్‌ వార్డులు ఏర్పాటుచేయాలని ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠశాల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కరోనాపై విద్యార్థులకు అవగాహన పెంచాలని సూచించారు. ఇక ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు, శానిటైజర్‌లు ఉపయోగించేందుకు సీబీఎస్‌ఈ అనుమతిచ్చింది

వుహాన్‌, ఇటలీ లాంటి కరోనా వైరస్‌ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు కూడా ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Follow Us
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
రోజూ చెంచా నెయ్యిని ఇలా తిన్నారంటే.. మీ బాడీలో ఊహించని మార్పులు!
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు