Practice Session : టీమిండియా ప్రాక్టీస్కు అడ్డొచ్చిన వరుణుడు.. జిమ్లో చెమట చిందిస్తున్న ఆటగాళ్లు
మూడో టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకు వరుణుడు అడ్డొచ్చాడు. మెల్బోర్న్లో ఆదివారం జోరుగా వర్షం కురవడంతో మైదానం తడిసి ముద్దైంది..
Practice Session : మూడో టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లకు వరుణుడు అడ్డొచ్చాడు. మెల్బోర్న్లో ఆదివారం జోరుగా వర్షం కురవడంతో మైదానం తడిసి ముద్దైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో వర్షం పడిన కారణంగా ఆదివారం జరగాల్సిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI ) ప్రకటించింది.
మైదానంలో ప్రాక్టీస్ లేనందున జిమ్లో ఆటగాళ్లు చెమట చిందించారని బోర్డు తెలిపింది. జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్లు సిడ్నీకి సోమవారం బయలుదేరనున్నాయి.
వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమ్ఇండియా.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెల్చుకుంది. ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఇవి కూడా చదవండి..
చివరి టెస్టు మ్యాచ్పై అనుమానాలు.. ఆటగాళ్ల ఐసోలేషన్ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీమిండియా అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ ..