చివరి టెస్టు మ్యాచ్పై అనుమానాలు.. ఆటగాళ్ల ఐసోలేషన్ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీమిండియా
చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు టీమిండియా ఆటగాళ్లను..
Team India : ఆసీస్తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్పై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు టీమిండియా ఆటగాళ్లను శనివారం ఐసోలేషన్కు పంపారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్కు వెళ్లడానికి టీమిండియా సుముఖంగా లేదని తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. అయితే జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. బ్రిస్బేన్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కోవిడ్ ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్డౌన్లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన టీమిండియా, ఆసీస్ చెరో గెలుపుతో సమానంగా ఉన్నాయి. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7న ప్రారంభంకానుంది.
ఇవి కూడా చదవండి..
అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ .. తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం.. కోవిడ్ రిపోర్ట్ తెచ్చినవారికి మాత్రమే ఉంటుందన్న ఆలయ అధికారులు