AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 WC: అండర్-19 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం; చెలరేగిన వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు

అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకవర్త్‌ లూయిస్ ప్రకారం 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అటు భారత్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వరుణుడు ఆటంకం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు.

U19 WC: అండర్-19 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం; చెలరేగిన వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు
Ind19 Vs Nz19
Venkata Chari
|

Updated on: Jan 18, 2026 | 6:34 AM

Share

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత యువ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. జింబాబ్వేలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం.

బ్యాటింగ్‌లో మెరిసిన సూర్యవంశీ, కుందు: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ ఆయుష్ మ्हाత్రేతో పాటు మరికొందరు కీలక బ్యాటర్లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ మరియు అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా, అభిజ్ఞాన్ కుందు 112 బంతుల్లో 80 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివర్లో కనిష్క్ చౌహాన్ (28) మెరుపులు మెరిపించడంతో భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది.

బౌలింగ్‌లో విహాన్ మల్హోత్రా మ్యాజిక్: వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలగడంతో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165 పరుగులకు కుదించారు. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ ఒకానొక దశలో 17.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ, భారత బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో బంగ్లాదేశ్ వెన్ను విరిచాడు. కిలన్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్ మరియు కనిష్క్ చౌహాన్ చెరో వికెట్ సాధించారు. దీంతో బంగ్లాదేశ్ 28.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.

ఈ విజయంతో భారత అండర్-19 జట్టు టోర్నీలో సెమీఫైనల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. సూర్యవంశీ, కుందుల నిలకడైన బ్యాటింగ్, బౌలర్ల సమష్టి కృషి భారత్‌కు ఈ విజయాన్ని అందించాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..