AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిన్న తర్వాత మీకు గుండెల్లో మంటగా అనిపిస్తుందా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..

ఈ సమస్యకు పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా మీరు ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

తిన్న తర్వాత మీకు గుండెల్లో మంటగా అనిపిస్తుందా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..
Acidity Problem
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2022 | 8:55 AM

Share

పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం మీ జీర్ణ శక్తిని ప్రభావితం చేస్తుంది. తిన్న తర్వాత చాలా మందికి గుండెల్లో మంట వస్తుంది. మీరు తేలికైన లేదా బరువుగా ఏదైనా తిన్నప్పుడు, మీ ఛాతీలో లేదా కడుపులో మంట ప్రారంభమవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా మీరు ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

అల్లం నీరు తాగాలి.. అల్లం ఎసిడిటీని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అల్లం ముక్కను నమలడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. కావాలంటే నీళ్లలో వేసి మరిగించుని వడగట్టుకోవచ్చు. నీరు వెచ్చగా ఉన్నప్పుడే మీరు దానిని తాగేయాలి.

సొంపు తినటం.. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్. కడుపులోని గ్యాస్‌ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఇది పనిచేస్తుంది. మీరు ఆహారం తిన్న తర్వాత ప్రతిరోజూ కొంచం సోంపును తీసుకోవచ్చు. ఇది మీకు గుండెల్లో మంట సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. మీకు కావాలంటే, మీరు ఒక గ్లాసు నీటిలో సోంపును రాత్రంతా నానబెట్టుకుని… దీన్ని వడగట్టి ఉదయాన్నే నీళ్లు తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

పండిన అరటిపండ్లు తినాలి.. అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.. అరటిపండును భోజనం తర్వాత క్రమం తప్పకుండా తినవచ్చు.

బెల్లం తినండి ..గుండెల్లో మంట సమస్య నుండి బయటపడటానికి భోజనం తర్వాత బెల్లం తినటం అలవాటు చేసుకోవాలి.. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

కలబంద జ్యూస్ తాగండి.. కలబంద రసం తాగడం వల్ల కడుపులో చికాకు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి మెడికల్ స్టోర్లలో సులభంగా దొరుకుతాయి. మీకు కావాలంటే మీరు తినవచ్చు. ఇది కడుపులోని ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం తాగండి.. నిమ్మకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. తిన్న తర్వాత ఒక కప్పు నీటిలో నిమ్మరసం, నల్ల ఉప్పును కలిపి తాగాలి. ఇది గుండెల్లో మంట నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

ఇతర ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)