అమరావతి : వాటర్ ట్యాంకులో 10వేల మద్యం సీసాలు
ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం చెయ్యాలని పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తోంది. మందుబాబులు మాత్రం మాట వినడం లేదు.
ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం చెయ్యాలని పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తోంది. మందుబాబులు మాత్రం మాట వినడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మద్యాన్ని ఏపీలోకి రవాణా చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ తమ బుద్ది మార్చుకోవడం లేదు. తాజాగా అమరావతి మండలం మునగోడులో భారీగా లిక్కర్ పట్టుబడింది. వాటర్ ట్యాంకులో దాచిన 10 వేల లిక్కర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచిన 8 మందిని అరెస్ట్ చేశారు.
గత కొంతకాలంగా వెరైటీ పద్దతుల్లో ఏపీలోకి మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఈ మధ్య కొందరు వ్యాపారులు ఏకంగా కొరియర్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమం మద్యం వ్యాపారం చేస్తున్నారు. దీంతో పోలీసులు మద్యం అక్రమ రవాణాపై మరింత ఫోకస్ పెట్టారు.
Also Read :
చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా టెర్రర్..కేంద్రం కీలక ఆదేశాలు
అడ్మిషన్ రద్దు చేసుకుంటే విద్యా సంస్థలు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే