చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా టెర్రర్..కేంద్రం కీలక ఆదేశాలు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో సదరు జిల్లాల్లో కోవిడ్ కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ ఐదు రాష్ట్రాల్లోని 15 జిల్లాల అధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, మరణాల రేటును 1 శాతం దిగువకు తీసుకురావడానికి ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించింది.
ఆయా జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందునే ఈ సూచనలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లను, హోమ్ ఐసోలేషన్ కేసులను కట్టుదిట్టంగా పర్యవేక్షించడం, కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం, త్వరితగతిన వైద్యం అందించడం వంటి చర్యలు చేపట్టాలని కోరామన్నారు.
Also Read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : ఇకపై ఆ బాధ్యత సచివాలయాలదే