అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..
బిర్యానీ తినాలనిపించి కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లింది ఓ మహిళ. అక్కడ అందరికీ బిర్యానీ ఆర్డర్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే వేడి వేడి బిర్యానీ వారిముందు ప్రత్యక్షమైంది. అందరూ హ్యాపీగా బిర్యానీ తిన్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు ఓ ఎముక గొంతులో ఇరుక్కుపోయింది. అది బయటకు రాక ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్య సిబ్బంది సీటీ స్కాన్ తీయాలని చెప్పారు. అందుకు అంగీకరించని మహిళ ఇంటికి వెళ్ళిపోయింది. ముంబయికి చెందిన రూబీ షేక్ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్లింది. అక్కడ బిర్యానీ తింటున్న ఆమెకు గొంతులో ఎముక ఇరుక్కోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వైద్యులు సిటి స్కాన్ చేయాలని చెప్పగా వద్దని ఇంటికి వెళ్లిపోయిన రూబీకి రెండు రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం వచ్చింది. బీపీ కూడా పెరిగిపోయింది. దీంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఎక్స్రే, సిటి స్కాన్ చేశారు. గొంతులో ఇరుక్కున్న ఎముకను చూసి ఆపరేషన్ చేయాలని సూచించారు. దాంతో చేసేది లేక ఆపరేషన్కు ఒప్పుకుంది. ఈ క్రమంలో 8 గంటలు శ్రమించి ఆపరేషన్ చేసి ఎముకను బయటకు తీశారు వైద్యులు. గొంతులోకి చేరిన ఆహారం ఏదైనా కిందికి జారుతుందని, అందుకు విరుద్ధంగా ఈ ఘటనలో ఎముక గొంతు పైభాగం నుంచి ప్రయాణించిందని, బిర్యానీ తింటున్నప్పుడు రూబీ దగ్గడం వల్ల ఎముక పైకి జరిగి గొంతులో గుచ్చుకొని ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే
విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

