విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
పీతల్లో చాలా రకాలు ఉంటాయి.. కొన్ని మంచి నీటి పీతలు.. మరికొన్ని ఉప్పు నీటి పీతలు. సముద్ర తీర ప్రాంతాల్లోనూ రకరకాల పీతలు కనిపిస్తూ ఉంటాయి. నీటిలో, తీరంలో, ఇసుక బొరియల్లో సాధారణంగా మనం వాటిని చూస్తూ ఉంటాం. విశాఖలోని సాగర్ నగర్ బీచ్లో అరుదైన పసుపు రంగు పీతలు కనిపించాయి. చూడటానికి భలేగా ఉండటంతో అవి ఏ జాతికి చెందినవన్న ఆసక్తి జనాల్లో పెరిగింది.
అటు ఇటు తిరుగుతూ.. ఒక్కోసారి ఉరుకులు పరుగులు పెడుతూ.. ఏదైనా హాని జరుగుతుందని అనిపిస్తే తనను తాను రక్షించుకునేందుకు ముడుచుకుంటూ ఈ ఎండ్రకాయలు సందడి చేశాయి. తీరంలో ఈ పీతలు తిరగడం అరుదని మత్స్యకారులు అంటున్నారు. ఇవి బొరియల్లో, లేకపోతే సముద్రంలో మాత్రమే ఉంటాయట. పగలంతా సముద్రంలో ఉన్నా చీకటి పడేసరికి మనిషి కంటపడకుండా బొరియల్లోకి దూరిపోతాయట. వలలకు ఈ పీతలు అస్సలు చిక్కవట.. కానీ భలే రుచిగా ఉంటాయని అంటున్నారు మరికొందరు మత్స్యకారులు. ఓసిపోడ్ క్వాడ్రాటా జాతికి చెందిన ఈ పీతలు.. ఉష్ణ మండల సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసిస్తాయి. నిటారుగా పైకి కనిపించే వాటి కళ్ళు 360 డిగ్రీలు తిరుగుతాయి. చిన్న పీతలు ఇసుక రంగులో ఉంటాయి. అందుకే ఆ రంగులో ఈజీగా కలిసిపోతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూసినవాళ్లకు షాక్
మరోసారి డాన్స్తో అదరగొట్టిన సాయి పల్లవి..
చడీచప్పుడు కాకుండా… శ్రీలీలతో లవ్స్టోరీ చేస్తున్న అఖిల్
హనీరోజ్ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

