చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో
మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. గొంతులో పల్లీగింజ ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి చెందాడు.. పల్లిగింజలు గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ బాలున్ని తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు. ఈ విషాద సంఘటన గూడూరు మండలం నాయక్ పల్లి లో జరిగింది.
నాయక్ పల్లికి చెందిన వీరన్న – కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏడాదిన్నర వయస్సు గల బాలుడు అక్షయ్ ఫిబ్రవరి 7వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ ఇంటి ముందు అరబెట్టిన పల్లి గింజలు తినడానికి ప్రయత్నించాడు. ఆ పలిగింజలు గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడు పల్లి గింజలు మింగి ఉంటాడని గమనించిన తల్లిదండ్రులు అక్కడి నుండి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించిందని ఎంజిఎంకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడి నుండి 108 లో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులను ఈ ఘటన కలచివేసింది.
మరిన్ని వీడియోల కోసం :
రన్యారావుకు కోర్టులో షాక్.. ఏమైందంటే వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు..అంతలోనే ప్రమాదం వీడియో

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా?

పెళ్లి పీటలపై వధువు స్థానంలో ఆమె తల్లి..షాకైన పెళ్లికొడుకు తర్వాత

వామ్మో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాలు వీడియో

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
