Dattatreya Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం...

Dattatreya Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Follow us

|

Updated on: Dec 14, 2020 | 12:20 PM

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఆయన కారు రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండలో జరగనున్న పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు దత్తాత్రేయ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం అనంతరం దత్తాత్రేయ మరో వాహనంలో నల్లగొండకు బయలుదేరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

CM JAGANA POLAVARAM TOUR: పోలవరం పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ.. ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి…

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఏనుగులు మ‌ర‌ణిస్తున్న‌ దేశాల జాబితాలో శ్రీ‌లంక ముందంజ‌.. తాజా నివేదిక‌లు వెల్ల‌డి