AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం […]

మాజీ మంత్రి ముత్యంరెడ్డి కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 02, 2019 | 9:23 AM

Share

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దురదృష్టం అని కేసీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్‌తో ముత్యం రెడ్డికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ తర్వాత పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. అలాగే ముత్యం రెడ్డి ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో.. నిరాశ చెందిన ఆయన ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.