అయిదు నగరాల్లోనే సగానికిపైగా కేసులు.. అసలేం జరుగుతోంది?

లాక్ డౌన్ ఎత్తివేతలో మొదటి దశ జూన్ 8వ తేదీన మొదలైంది మొదలు.. దేశంలో కరోనా కథాకళీ ఆడుతోంది. ప్రస్తుతం (జూన్ 13వ తేదీ సాయంత్రానికి) దేశంలో 3,08,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరగనున్నట్లు ..

అయిదు నగరాల్లోనే సగానికిపైగా కేసులు.. అసలేం జరుగుతోంది?
Follow us

|

Updated on: Jun 13, 2020 | 5:56 PM

లాక్ డౌన్ ఎత్తివేతలో మొదటి దశ జూన్ 8వ తేదీన మొదలైంది మొదలు.. దేశంలో కరోనా కథాకళీ ఆడుతోంది. ప్రస్తుతం (జూన్ 13వ తేదీ సాయంత్రానికి) దేశంలో 3,08,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరగనున్నట్లు అంఛనాలు వినిపిస్తున్నాయి. జులై నెలాఖరు దాకా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతాయని అంటున్నారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయంటూ పలు మీడియా సంస్థలు, వెబ్ సైట్లు రాస్తున్నాయి. జర్నల్స్ ప్రచురితం అవుతున్నాయి. కానీ ఏదీ వెనువెంటనే పలితమిచ్చేలా లేకపోవడంతో ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసులను చూస్తూ అందరూ వర్రీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలో మొదటి కరోనా కేసు నుంచి లక్ష సంఖ్యను చేరుకునేందుకు 109 రోజులు పట్టగా.. ఆ తర్వాత శరవేగంగా రెండు లక్షలకు.. ప్రస్తుతం మరింత వేగంగా మూడు లక్షలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. అయితే విశాలమైన మన దేశంలో కేవలం 5 నగరాలలోనే సగానికి పైగా అంటే మూడు లక్షల్లో సుమారు లక్షా 55 వేల కేసులు నమోదయ్యాయంటే కరోనా విస్తరణకు జనసాంద్రతే ప్రధాన కారణమని, జనసాంద్రత అధికంగా వున్న నగరాలలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందని అంఛనా వేస్తున్నారు.

శనివారం సాయంత్రానికి ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 56 వేలకు చేరువలో వుంది. ముంబయి మహానగరంలో భాగమైన థానేలో నమోదైన 16 వేల కరోనా కేసులను కూడా కలుపుకుంటే ముంబయి మహానగర పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 72 వేలుగా చెప్పుకోవచ్చు. అటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 37 వేలకు చేరువలో వున్నాయి. దక్షిణాదిన ముఖ్య మహానగరం చెన్నైలో పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. అహ్మదాబాద్ నగరంలో 16 వేలు, ఫుణెలో 11వేల కేసులు నమోదయ్యాయి. ఈ అయిదు నగరాలను కలుపుకుంటూ మొత్తం కేసుల్లో సగానికి పైగా కనిపిస్తున్నాయి.

వీటిలో ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, ఫుణె నగరాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో పలు మార్గాల ద్వారా చేరుకోవడమే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమైంది అన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. దాంతో జనసాంద్రత అధికంగా వుండే ప్రాంతాల్లో కరోనా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించేలా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ప్రస్తుతం ప్రభుత్వాల మీద, స్వచ్ఛంద సంస్థల మీద వున్న బాధ్యత అని విశ్లేైషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం