AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ రచయిత్రి భాగ్యలక్ష్మీ కన్నుమూత

ప్రముఖ రచయిత్రి, నందీ అవార్డు గ్రహీత కొల్లూరి భాగ్యలక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆవిడ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు కంచిలోని అత్తివరదర్ పెరుమాల్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లారు. దర్శనం అనంతరం అరక్కోణం చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై-ఎగ్మోర్‌ రైల్లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించారు. ఆమె విపుల మాసపత్రికలో పనిచేసి దశాబ్దం క్రితం ఉద్యోగ విరమణ […]

ప్రముఖ రచయిత్రి భాగ్యలక్ష్మీ కన్నుమూత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2019 | 10:09 AM

Share

ప్రముఖ రచయిత్రి, నందీ అవార్డు గ్రహీత కొల్లూరి భాగ్యలక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆవిడ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తమిళనాడు కంచిలోని అత్తివరదర్ పెరుమాల్ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వెళ్లారు. దర్శనం అనంతరం అరక్కోణం చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై-ఎగ్మోర్‌ రైల్లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించారు. ఆమె విపుల మాసపత్రికలో పనిచేసి దశాబ్దం క్రితం ఉద్యోగ విరమణ చేశారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె కుమారుడు అమెరికాలో, కుమార్తె బెంగళూరులో నివసిస్తున్నారు. లక్ష్మి రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. మనసున మనసై, జూకామల్లి కథల సంపుటాలు వెలువరించారు. ఆమె రాసిన వీక్షణం, గమనం కవితా సంకలనాలు కవయిత్రిగానూ పేరు తెచ్చాయి.