రాష్ట్రవ్యాప్తంగా.. శ్రీవారి లడ్డూ విక్రయాలకు విశేష స్పందన..!
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సోమవారం
Srivari Laddu: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రాలతో పాటు టీటీడీ కళ్యాణమండపాల వద్ద లడ్డూల విక్రయం జరుగనుంది. లడ్డూ ప్రసాదం విక్రయాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. పలు జిల్లాలో ఇప్పటికే లడ్డూ విక్రయాలు పూర్తయ్యాయి. ఈ రోజు కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
కాగా.. రేపు ప్రతి జిల్లా కేంద్రానికి 30 వేల లడ్డూలను టీటీడీ పంపించనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో లడ్డూ విక్రయాలు ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లడ్డూలను టీటీడీ పంపించనుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టీటీడీ కళ్యాణ మండపంలో పలు జిల్లాలో ఇప్పటికే లడ్డూ విక్రయాలు పూర్తయ్యాయి.
మరోవైపు.. గతంలో ప్రకటించిన శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో, ఆలయ పోటు పేష్కార్ నంబర్లకు బదులుగా టీటీడీ… కాల్ సెంటర్ టోల్ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333 ను తెచ్చింది. ఇప్పుడు భక్తులు లడ్డూలు కావాలంటే ఏం చెయ్యాలి, ఎన్ని లడ్డూలు ఇస్తారు, ధర ఎంత, ఎలా ఇస్తారు, ఎలా బుక్ చేసుకోవాలి, కరోనా టైమ్లో లడ్డూలు తీసుకోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి, ఇలా ఏ డౌట్స్ ఉన్నా… ఈ టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చని టీటీడీ పాలక మండలి తెలిపింది.