హైదరాబాద్లో కిలాడీ ముఠా..వ్యభిచారం చేస్తూ డ్రగ్స్ సప్లై !
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా, వినియోగం ఆగడం లేదు. గ్రేటర్లో డ్రగ్స్ నీడలు లేకుండా చేసేందుకు టీవీ9 తన వంతు ప్రయత్నంగా..
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా, వినియోగం ఆగడం లేదు. గ్రేటర్లో డ్రగ్స్ నీడలు లేకుండా చేసేందుకు టీవీ9 తన వంతు ప్రయత్నంగా ఆపరేషన్ చార్లి ద్వారా కీలక ఆధారాలను సేకరించి సీపీ సజ్జనార్కు అందజేసింది. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ దొరకడంతో కలకలం రేగింది. మరో డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ముఠా డ్రగ్స్ సరఫరాతో పాటు ఆన్లైన్లో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు యువతుల ద్వారా విటులు, ఇతరులకు ఈ ముఠా డ్రగ్స్ సప్లై చేస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న ముఠా వద్ద నుంచి 200 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక నైజీరియన్ నుంచి సమాచారం అందడంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు సమాచారం. ఈ ముఠా ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్ను ఇక్కడికి తెచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లిస్ట్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Also Read :
స్టేట్ సెక్యూర్టీ కమిషన్లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !