ఢిల్లీపై చలి పంజా..గజగజలాడుతోన్న ప్రజలు
ఢిల్లీని ఒకవైపు కాలుష్యం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 120 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత చలి..ఢిల్లీపై పంజా విసిరింది. గత 14 రోజులుగా దేశ రాజధాని చలితో వణికిపోతోంది. ఈ పక్షం రోజుల్లో అక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్. డిసెంబర్ 31 నాటికి ఇది 19.15 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు. డిసెంబర్ సగటు ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 లలో మాత్రమే […]
ఢిల్లీని ఒకవైపు కాలుష్యం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 120 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత చలి..ఢిల్లీపై పంజా విసిరింది. గత 14 రోజులుగా దేశ రాజధాని చలితో వణికిపోతోంది. ఈ పక్షం రోజుల్లో అక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్. డిసెంబర్ 31 నాటికి ఇది 19.15 డిగ్రీల సెల్సియస్కు పడిపోతుందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
డిసెంబర్ సగటు ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 లలో మాత్రమే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. డిసెంబర్ 1997 అత్యల్ప సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన 19.4 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గితే.. ప్రస్తుత నెల 1901 నుండి రెండవ అతి చలితో కూడిన డిసెంబర్ అవుతుంది. ఇక దట్టమైన పొగమంచు, కోల్డ్ వేవ్ రాబోయే రెండు రోజులలో కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా శనివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 2.4 డిగ్రీలని నమోదు అయ్యింది. ఈ సీజన్లో ఇదే ఇప్పటివరకు అత్యల్పం. ఐఎండీ లెక్కల ప్రకారం, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 నోట్లు ఉన్నప్పుడు “చల్లని రోజు”. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 6.5 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు “తీవ్రమైన చల్లని రోజు”.
గాలి దిశలో మార్పు డిసెంబర్ 30 నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇది కొంతమేర చలి నుంచి ఉపశమనం కలిగించవచ్చు. చలితో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10, 11 సమయం వరకు మంచు తెర వీడటం లేదు. మంచు వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్ల సర్వీసులకు అంతరాయం కలుగుతోంది.