AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరకొట్టేస్తోన్న కీరవాణి తనయులు.. స్క్రీన్ల పెంపు

బాక్సాఫీస్ వద్ద కీరవాణి తనయులు ఇరకొట్టేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ‘మత్తు వదలరా’కు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తుండటంతో.. వీకెండ్‌లో స్క్రీన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ‘ఏ’ క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మల్టీఫ్లెక్స్‌ల్లోనూ షోలను పెంచుతున్నారు. మరోవైపు యూఎస్‌లోనూ ‘మత్తు వదలరా’ దూసుకుపోతుండగా.. అక్కడ కూడా మంచి స్క్రీన్లను పెంచారు. దీంతో ఈ చిత్రానికి మంచి లాభాలు కన్ఫర్మ్ అని […]

ఇరకొట్టేస్తోన్న కీరవాణి తనయులు.. స్క్రీన్ల పెంపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 28, 2019 | 3:07 PM

Share

బాక్సాఫీస్ వద్ద కీరవాణి తనయులు ఇరకొట్టేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ‘మత్తు వదలరా’కు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తుండటంతో.. వీకెండ్‌లో స్క్రీన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ‘ఏ’ క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మల్టీఫ్లెక్స్‌ల్లోనూ షోలను పెంచుతున్నారు. మరోవైపు యూఎస్‌లోనూ ‘మత్తు వదలరా’ దూసుకుపోతుండగా.. అక్కడ కూడా మంచి స్క్రీన్లను పెంచారు. దీంతో ఈ చిత్రానికి మంచి లాభాలు కన్ఫర్మ్ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

కాగా రితేష్ రాణా ‘మత్తు వదల’రాకు దర్శకత్వం వహించాడు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరోగా.. పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. జీవా, విద్యుల్లేఖ రామన్, సత్య, నగరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.