ఆయన ఒప్పించడం వలనే ‘మహానటి’ చేశా..!

మహానటి.. టాలీవుడ్‌లో ఈ పేరుకు ఎంత గొప్ప చరిత్రో ఉందో.. ఆ పేరుతో వచ్చిన సినిమాకు అంతే ప్రత్యేక స్థానం ఉంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందడంతో పాటు.. పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదు, జీవించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే ఆ పాత్రలో నటించేందుకు ఆమె చాలా కసరత్తులే చేసింది. సావిత్రి సినిమాలను చూసి, […]

ఆయన ఒప్పించడం వలనే 'మహానటి' చేశా..!
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 1:31 PM

మహానటి.. టాలీవుడ్‌లో ఈ పేరుకు ఎంత గొప్ప చరిత్రో ఉందో.. ఆ పేరుతో వచ్చిన సినిమాకు అంతే ప్రత్యేక స్థానం ఉంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందడంతో పాటు.. పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదు, జీవించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే ఆ పాత్రలో నటించేందుకు ఆమె చాలా కసరత్తులే చేసింది. సావిత్రి సినిమాలను చూసి, ఆమె గురించి సన్నిహితులు, కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకొని ఆ పాత్రలో ఒదిగిపోయింది కీర్తి. ఇందుకు గానూ జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డు వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఉత్తమ నటి అవార్డును అందుకుంది ఈ మహానటి. ఆ అవార్డును తీసుకునే సమయంలో తన ఒళ్లు గగుర్పొడిచిందని భావోద్వేగంతో చెప్పుకొచ్చింది కీర్తి. అయితే ఈ సినిమాకు కీర్తి మొదట్లో నో చెప్పిందట.

కథ విన్న వెంటనే బావున్నా.. తాను ఆ పాత్రకు న్యాయం చేయలేనన్న భావనతో మహానటిని చేయలేనని చెప్పిందట. అయితే ఈ పాత్రలో తనను తప్ప మరెవరిని ఊహించుకోలేనని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడంతో కాస్త ఆలోచించిందట. అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం తన మామయ్య గోవింద్ అని తెలిపింది కీర్తి. సావిత్రమ్మ పాత్రను బాగా చేయగలనన్న నమ్మకం తనకు తన మామయ్య ఇచ్చారని, ఈ మూవీని తాను ఒప్పుకోవడానికి ఆయనే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సందర్భంగా తనను నమ్మినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్‌కు చాలా థ్యాంక్స్ అని కీర్తి తెలిపింది. అలాగే సావిత్రమ్మ ఆశీస్సుల వలనే ఈ సినిమాను చేయగలిగానని.. ఈ అవార్డును ఆమెకు అంకితం ఇస్తున్నట్లు చెప్పింది. కాగా జాతీయ అవార్డు అందుకున్న తరువాత తనపై ఒత్తిడి ఎక్కువగా ఉందని.. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని కీర్తి పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా, గుడ్‌లక్ సాక్షి, రంగ్ దే మూడు చిత్రాల్లో నటిస్తోన్న కీర్తి.. తమిళంలో రజనీ 158వ చిత్రం, పెంగ్విన్‌ మూవీల్లో కనిపించనుంది. వీటితో పాటు మలయాళంలో మోహన్‌లాల్ మూవీలోనూ కీర్తి నటిస్తోంది.